తెలంగాణ అమర్నాథ్ యాత్ర.. ప్రారంభమైన సలేశ్వరం జాతర

అచ్చంపేట: నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తయిన కొండలు.. లోయలు.. పక్షుల కిలకిలరావాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. చెంచులే పూజారులుగా జరిపే నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని సలేశ్వరం ఉత్సవాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దారిపొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపాతాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తాయి.దారి పొడవునా అపురూప దృశ్యాలే..
నల్లమల కొండపై నుంచి జాలువారే జలపాతాలు.. పచ్చదనంతో నిండిన కొండలు.. కోనలు.. లోయలు.. గుహలు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయతే.. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో లింగమయ్య కొలువుదీరడం నల్లమల వాసుల పుణ్యమని చెప్పొచ్చు. చెంచుల కులదైవం లింగమయ్య (పరమశివుడు) దర్శనం పూర్వజన్మ సుకృతం.. సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దారిపొడవునా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దాతలు ఉచిత అన్నదాన శిబిరాలు, చలివేంద్రాలు, వసతి ఏర్పాటు చేస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు స్వామి దర్శనానికి వస్తుంటారు .
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels


Latest News
