అంబేద్కర్ సాధించిన విజయాల్లో నేటి యువత కొన్ని అయినా సాధించాలి
అంబేద్కర్ విగ్రహ దాత కోట తరుణ్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్ పురం గ్రామ గ్రామపంచాయతీ సెంటర్ లో కోట రవీందర్ రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం కుమారుడు కోట తరుణ్ రెడ్డి గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు అనే నినాదంతో దాతగా నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లయ్ రామచంద్ర నాయక్ విగ్రహావిష్కరణ చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందుంటానని,గ్రామ ప్రజల మన్ననాలను పొందుతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు నడిపించడానికి కృషి చేస్తానన్నారు. బురహాన్ పురం గ్రామ అంబేద్కర్ విగ్రహ స్థాపన కార్యవర్గ కమిటీ చింత వెంకన్న ఆటో, గుగ్గిల పుల్లయ్య,గుగ్గిల నరసయ్య,చింత వెంకన్న,సోమారపు సైదులు,పోలెపంగు వెంకన్న,గుగ్గిల గణేష్ ,అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముందుండి నడిపించారు..నేటి యువత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా పనిచేయాలని, అంబేద్కర్ సాధించిన విజయాలలో కొన్నినైనా నేటి యువత సాధించి ఆయన మార్గంలో నడవాలని కోరుకున్నారు. అంబేద్కర్ అంటే విగ్రహం కాదు నిలువెత్తు జ్ఞాని అని, ఈ ప్రపంచంలో అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అంటే ఆయన రచించిన రాజ్యాంగమే ఈరోజు అందర్నీ నడిపిస్తుందన్నారు. గ్రామాల్లో ఉండే యువత చెడుకు దూరంగా ఉండి,లక్ష్య సాధన వైపు, అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపే విధంగా పనిచేయాలన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

