ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి..
నమస్తే భరత్.,,,17/4/2025/ నారాయణపేట జిల్లా : తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ బిజ్వార్ మహేష్ గౌడ్... తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్స్ సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ బిజ్వార్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.గురువారం మండల పరిధిలోని జక్లేర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లకి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ గతంలో రాష్ట్ర మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి,జిల్లా కలెక్టర్లకు,ఆర్డీవోలకు, ఎమ్మార్వోలకు,కమిషనర్లకు, మున్సిపాలిటీ చైర్మన్ లకు,వైస్ చైర్మన్ లకు తమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని,ప్రైవేట్ టీచర్ల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర,జిల్లా నాయకులు భీoరెడ్డి, సిద్రాo,రాధిక,అరుణ, ప్రభావతి,అనిత,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
