కలెక్టర్ జితేష్ పాటిల్ కు ఘన సన్మానం
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలని అత్యంగా ఘనంగా నిర్వహించుటకు పూర్తి సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ను అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ దళిత సంఘాలు ఆధ్వర్యంలో బుధవారం శాలువ గజ మాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర బాధ్యులు జీబి.శౌరి, దళిత సంఘల నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వందలాది మందితో కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. 8 లక్షలకు పైగా నిధులతో సింగరేణి సీఅండ్ఎండి బలరాం నాయక్ తోడ్పాటుతో బాబాసాహెబ్ అంబేద్కర్ కి నిచ్చెనను ఏర్పాటు చేయడం జరిగిందని అదే విదంగా అంబేద్కర్ భవన్ కి నిధులు కేటాయించి సంఘాల ద్వారా అంబేద్కర్ భవన్ ను ఉపయోగంలోకి తేవాలని ఈ సందర్భంగా వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర బాధ్యులు జేబీ శౌరి, కూసపాటి శ్రీనివాస్ మాదిగ, మధుసూదన్ చిన్ని, మంద హనుమంతు, తాండ్ర వెంకటేశ్వర్లు, హై కోర్టు న్యాయవాది యెర్రా కామేష్, కాకెళ్ళి సైమన్, బొమ్మెర శ్రీనివాస్, సబ్బారావు నాగేందర్(బుస్సి), చదలవాడ సూరి, కూరపాటి రవీందర్, మందా సాంబయ్య, గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

