భద్రాద్రి జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో : రాబోయే 2025-26 విద్యా సంవత్సరంకు గాను జిల్లాకు రావలసిన పాఠ్యపుస్తకాలు భద్రాద్రి కొత్తగూడెంకు చేరుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరచారి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు రాబోయే విద్యా సంవత్సరంకుగాను 5,08,400 పాఠ్యపుస్తకాలు అవసరం ఉన్నదని కాగా మొదటి విడతగా ప్రస్తుతానికి 39,150 పాఠ్యపుస్తకాలు రాష్ట్ర గోదాము నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్నాయని చెప్పారు. ఈనెలాఖరు వరకు మొత్తం పాఠ్యపుస్తకాలు వస్తాయని రాగానే మండలాల వారీగా పంపిణీ చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో ఒక మంచి ప్రణాళికతో తగు విధముగా పాఠ్యపుస్తకాలను మండలాలకు తద్వారా స్కూల్ కాంప్లెక్స్ లకు ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు మే నెల చివరి వారము వరకు పంపిణి చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
