నేడు కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
- భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరు మండలం ఎన్నిక - మండలంలోని ఖాజీపూర్ గ్రామంలో ప్రారంభించనున్న మంత్రి
నమస్తే భారత్ /మద్దూరు, నారాయణపేట జిల్లా ( ఏప్రిల్ 16) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి చట్టం అమలు కొరకు రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులుగా ఎన్నుకోబడిన నాలుగు మండలాల్లో నారాయణపేట జిల్లా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని మద్దూరు మండలం ఒకటి కావడంతో మండలంలోని ఖాజీపూర్ గ్రామంలో ఈరోజు భూ భారతి పోర్టల్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించడానికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తున్నట్టు ఆయన వ్యక్తిగత సహాయకులు పి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ హిమాయత్ సాగర్ లోని ఆయన నివాసం నుండి ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు ఖాజీపూర్ చేరుకుంటారన్నారు. అనంతరం గ్రామపంచాయతీ దగ్గర ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని భూ భారతి పోర్టల్ ను ప్రారంభించి 11:30 కు హైదరాబాద్ కు బయలుదేరుతారు అన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

