మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 16) : భూ భారతి పోర్టల్ పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరు మండలం ఎన్నికైనందున ప్రజలకు అవగాహన కల్పించేందుకు మద్దూరు మండలంలోని ఖాజీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నందున బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామంలోని రెండు స్థలాలను చూసిన కలెక్టర్ మండల పరిషత్ పాఠశాల ఎదురుగా ఉన్న స్థలంలో భూ భారతి రెవెన్యూ సదస్సుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా గురువారం రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ భారతి పోర్టల్ పైలెట్ ప్రాజెక్టును మండలంలోని ఖాజీపూర్ లో ప్రారంభించనున్నారు. అందుకోసం కలెక్టర్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రిచే ప్రారంభించే భూ భారతి సదస్సుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలొమ్, ఆర్డిఓ రామచందర్ నాయక్, మద్దూరు మండల తహాసిల్దార్ మహేష్ గౌడ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

