బాధిత కుటుంబానికి తోడుగా నిలిచిన కాలనీ వాసులు
నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం సీతారాంపురం ఎస్సీ కాలనీ కి చెందిన కొమ్ము పరశురాములు రాధ దంపతులకు ముగ్గురు సంతానం వీరి కుటుభం కొన్ని సంవత్సరాల గా జీవనోపాధి కోసం హైదరాబాద్ లో ఉంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో పెద్ద కుమార్తె స్పందన ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సభ్యుల కలహాలతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 6 న ఆత్మహత్య చేసుకుని మరణించగా వారి ఆర్దిక ఇబ్బందు లను గుర్తించిన సీతారాంపురం వాసులు కుటుంబాన్ని పరామర్శించి పెద్దలు మరియు యూత్ పిల్లలు అందరూ కలిసి దిన దిశకర్మలకు కావలసిన ఏర్పాట్లు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బోర గంగయ్య యాదవ్, జినక ముత్తయ్య, జినక ఉదయ్, రేఖ వెంకటేశ్వర్లు యాదవ్, మాచర్ల భద్రయ్య, అనంతగిరి శ్రీను డీలర్, అనంతగిరి రామన్న డీలర్, వీరబోయిన మురళి యాదవ్, బయ్యా లింగన్న, అనంతగిరి రవి, మిడతపల్లి శ్రీను, బలేం రవి, సోమారపు నరేష్,గడ్డం మల్సూర్,అనంతగిరి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రావు,సోమారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
