పట్టణ కేంద్రాలలో ఉపాధి పనులు చేపట్టాలి
రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య డిమాండ్
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్15 : పట్టణ కేంద్రాలలో ఎన్ఆర్ఈజీఎస్ పనులను వెంటనే చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య డిమాండ్ చేశారు మొయినాబాద్ లో జిల్లా సమితి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ2005 ముందు ఎన్నో పోరాటాలు చేసి గ్రామీణ పేదలకు ఉపాధి కోసం ఒక సమగ్ర చట్టం కావాలని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కోరితే 2005 సంవత్సరంలో మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చింది అప్పటినుంచి గ్రామీణ పేదలకు ఉపాధిగా ఉపయోగపడ్డ ఈ చట్టం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి నిధులు తగ్గించి రోజురోజుకు చట్టాన్ని నీవీర్య
ఘ పరుస్తూ పథకాన్ని ఎత్తేసే దిశలో ఆలోచన చేస్తుందని ఆయన మండిపడ్డారు ఈ పథకానికి ప్రతి సంవత్సరం 2 లక్షల 86 వేల కోట్ల అవసరం ఉంటే కేవలం 86 వేల కోట్లు మాత్రమే కేటాయించి ఈ పథకాన్ని సక్రమంగా పనులు చేయనీయకుండా రకరకాల అడ్డంకులు సృష్టిస్తుంది జాతీయ మోదీ ప్రభుత్వమని ఆయన విమర్శించారు ఇకనైనా అలాంటివి మానుకొని పేదలకు ఉపయోగపడే ఈ పథకానికి అధిక నిధులు కేటాయించి ఈ పథకాన్ని 200 రోజులు పెంచి రోజు కూలి కొలతలతో సంబంధం లేకుండా 700 రూపాయలు ఇవ్వాలని మిగతా సౌకర్యాలు అన్నీ కూడా కల్పించాలని దానితోపాటు పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి పనిని ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చరిగే బి కే ఎం యు మహాసభలు గ్రామా మండల మాసభలు ఈ నెల 31 వరకు పూర్తి చేసి జిల్లా మహాసభలు మే 10 వరకు పూర్తి చేయాలని ఆయనకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు జే అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కౌన్సిల్ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య కార్యక్రమాల రిపోర్ట్ ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీనివాస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ లక్ష్మయ్య జిల్లా కోశాధికారి ఎం కృష్ణ కౌన్సిల్ సభ్యులు స్వరూప యశోద ఎం నరసింహ బి నరసింహ పులగల మల్లేష్ రాములు సత్తిరెడ్డి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
