సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్14:సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోబ్లాక్ ఆఫీస్ ఆవరణలో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 134 జయంతి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరి నరసింహారెడ్డి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దులు జంగయ్యలు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదని మహాశక్తి అని అంబేద్కర్ చిన్నతనంలోనే కులవివక్ష అంటరానితనం ఎదుర్కొని చదువు కాడ దూరం మంచినీళ్ల కాడ దూరం అన్నం తినెకాడా దూరం పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అవి అన్నిటిని కూడా ఓర్చుకొని ప్రపంచంలో ఎవ్వరు చదవలేనని డిగ్రీలు చదివి భారత దేశ తలరాతను
మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు అణగారిన వర్గాల కోసం పోరాటం చేసి మహారాష్ట్ర లోనిమహార్ చెరువులో మంచినీళ్ళను అనాగారికి జనానికి తాపించిన ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొని ఆడారు జన్మనంత భారతావని జనం కోసం త్యాగం చేసిన త్యాగశీలుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సంతానం చనిపోయిన భార్య చనిపోయిన ఎన్ని బాధలు ఉన్నా ఓర్చుకొని భారతావని తలరాతను మార్చడానికి ఉద్భవించి మరో సూర్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారు పొగిడారు నేడు రాజకీయ పార్టీలు అంబేద్కర్ను రాజకీయంగా వాడుకుంటున్నాయి తప్ప అంబేద్కర్ చేసిన సేవలను గుర్తించి ఆయన రాసిన రాజ్యాంగాన్ని కరెక్టుగా అమలు పరచలేకపోతున్నారు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర కూడా జరుగుతుందని దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లేడు చౌదరిగూడ మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్, కొందుర్గు మండల కార్యదర్శి భాగాల నరసింహ నందిగామ మండల కార్యదర్శి గడ్డం జంగయ్య బి కే యం యు జిల్లా కోశాధికారి ఎం కృష్ణ ఏఐటియుసి కొత్తూరు మండల కార్యదర్శి శేఖర్ రెడ్డి బి కే ఎం యు కేశంపేట మండల నాయకులు దామోదర్ రెడ్డి ఏఐటీయూసీ చౌదరిగుడా మండల నాయకులు జి శేఖర్
గడ్డం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

