అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
టియుడబ్ల్యూజె (ఐజేయు) మఫీషియల్ కమిటీ కన్వీనర్ జి. శ్రీనివాస్
నమస్తే భారత్,షాద్ నగర్ ఆప్రిల్14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు మఫీషియల్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జి. శ్రీనివాస్ సూచించారు. సోమవారం కొందుర్గు మండల పరిధిలోని బైరంపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు సమాజంలో ఫలాలను పొందుతున్నామని గుర్తు చేశారు. వారు కన్నా కలలను నిజం చేసేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో అనేక వెసులుబాటులో కల్పించారని గుర్తు చేశారు. నేడు సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం లభిస్తున్నాయంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుడు జరుపుల రాజు నాయక్, మీడియా ప్రతినిధులు శ్రీనివాసులు, రాజు తోపాటు గ్రామస్తులు సిహెచ్ సిద్దు, చిన్న చంద్రయ్య, ప్రసాద్, శ్రీకాంత్, నర్సింలు, రవి, అరుణ్ కుమార్, చెన్నయ్య, ప్రవీణ్ కుమార్, ప్రకాష్, నర్సింలు, మల్లేష్, పి రమేష్, భాస్కర్ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
