ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ (ముగ్గు వేసే ప్రక్రియ) ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.
తేదీ, ఏప్రిల్ 15, 2025-
నమస్తే భరత్
నిర్మల్:-పట్టణంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పూర్తి చేసిన మార్కింగ్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ శాఖ ఏఈ మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు మార్కింగ్ ప్రక్రియను దగ్గరుండి చేయించాలన్నారు.ఈ సమావేశంలో జెడ్పి సీఈవో గోవింద్, పిడి హౌసింగ్ రాజేశ్వర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిడివోలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
