చలించిన హృదయం. అందించెను దాతృత్వం
- మానవత్వం చాటుకున్న మరిపెడ ఎస్సై సతీష్
- రోడ్డు ప్రమాదంలో ఇంటికే పరిమితమైన వ్యక్తికి రూ. 5వేల ఆర్థిక చేయూత
- కుటుంబ పెద్ద ఇంటికే పరిమితమవటంతో ఆర్థికంగా నలిగిన కుటుంబం.
- ఆపన్న హస్తాల కోసం ఎదురు చూపు..
నమస్తే భారత్ :-మరిపెడ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. రోజు కూలికి వెళ్తే గాని గడవని ఇల్లు.. వారిద్దరూ వారికి ఇద్దరు పిల్లలు.. ఇంతలో పెద్ద విషాదం.. పనికి వెళ్తూ ఇంటి పెద్ద రోడ్డు ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యారు. కుటుంబం అంతా ఆధారపడిన వ్యక్తి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఇల్లు గడవలేని దీనస్థితి వారిది.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బోట్య తండా కు చెందిన ధరంసోత్ నవీన్ వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పనికి వెళ్లి వస్తు రోడ్డు ప్రమాదానికి గురై అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మతిస్థిమితం సరిగా లేక బయటికి వెళ్లి పని చేయలేని పరిస్థితి. ఇంటి వద్ద ఉండటంతో నవీన్ భార్య కూడా భర్త వద్దకు చూసుకోవాలిగా పరిస్థితి. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా నలిగిపోతుంది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా ఇంటికి వెళ్లిన మరిపెడ ఎస్సై బొలగాని సతీష్ కుమార్ నరేష్ దీనస్థితిని చూసి చలించి పోయారు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అని తెలపడంతో తన వంతు సహాయంగా రూ.5000 నరేష్ కుటుంబానికి అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దాతలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, నవీన్ కోలుకునే వరకు చేయూత అందించాల్సిందిగా తండావాసులు కోరుతున్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
