ఈ నెల 27 న ఎల్కతుర్తి లో గులాబీ జాతరకు ప్రజలు,కార్యకర్తలు తరలిరావాలి
నమస్తే భారత్ :-హనుమకొండ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ పాతికేళ్ళ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్ అన్నారు బుధవారం ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడారు బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు,బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తరలిరానున్నట్లు సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయం అని అన్నారు తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి.తెచ్చి చూపించి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామీగా నిలిపిన ఘనత తమ అధినేత కెసిఆర్ కి దక్కుతుందని సత్యవతి రాథోడ్ వివరించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలు అయిందని అన్నారు ప్రజా క్షేత్రంలో గెలుపు ఓటములు సహజం అని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మాజీ ఎమ్మెల్యే లు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,గ్యాదరి బాలమల్లు, నాగుర్ల వెంకటేశ్వర్లు, తదితరులు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

