త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు
* సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుండి నీరు విడుదల
* జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జిల్లాలో త్రాగు నీటికి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుండి నీరు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా వాసులకు త్రాగు నీటికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణతో మిషన్ భగీరథ ఇరిగేషన్ అధికారుల సమన్వయతో మంగళవారం తుపాకుల గూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుండి అధికారులు 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని ఏప్రిల్ మే నెలలో త్రాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలలో భాగంగా నీటిని విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
