ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగులకు పాల్పడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవు

ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగులకు పాల్పడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవు

సిద్దిపేట: పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారుఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ జిల్లాలోఎవరైన క్రికెట్‌, మరే ఇతర బెట్టింగ్‌లకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ల మోజులో పడిలో వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా ఆప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది సాధించడంతో ప్రతి ఒక్కరికి ఇంటర్‌ అందుబాటులోకి రావడంతో పాటు, సోషల్‌ మీడియా సైతం యువతకు మరింత చేరువ అయింది. తద్వారా మోసగాళ్ళ మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులై సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ పాటు, ఇతరత్రా బెట్టింగ్‌ల వైపు యువత తొంగిచూడమే కాకుండా ఇంటి సభ్యులకు తెలియకుండా వీటిల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడంతో పాటు కొన్ని సందర్బాల్లో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్‌ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై వుందని. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో ఐపిల్‌ సిజన్‌ ప్రారంభం అయింది. ఇది దృష్టిలో వుంచుకోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై నిఘా పెట్టాలని, ముఖ్యంగా వారు క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రసారం అయ్యే సమయాల్లో వారి ప్రవర్తతో పాటు, వారు సెల్‌ఫోన్లలో మాట్లాడే సంభాషణపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు సూచించారు.పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బెట్టింగ్‌లను కట్టడి చేసేందుకు గాను పెద్దఎత్తున చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందుకోసం ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఇతర ప్రత్యేక బృందాలను వినియోగించుకొవడం జరుగుతోందని తెలిపారు.జిల్లాలో ఎవరైన బెట్టింగ్‌లను పాల్పడిన, పోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎవరైన బెట్టింగ్‌లకు పాల్పడినట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా డయల్‌ 100కు సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని సూచించారుసమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన