అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్17:ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో అకాల వర్షాలు, తీవ్ర గాలుల వల్ల 32 ఎకరాల కౌలు మామిడి రైతు శ్రీనివాస్ గౌడ్, 4 ఎకరాల బొప్పాయి తోట రైతు పసుల జంగయ్య తోటలను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సందర్శించి పరామర్శించడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మొన్న పడిన అకాల వర్షాల వల్ల కౌలు రైతు శ్రీనివాస్ గౌడ్, బొప్పాయి తోట రైతు పసుల జంగయ్య ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకం తెలంగాణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంప్లిమెంటేషన్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అధికారులు తోటలను సందర్శించి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. హార్టికల్చర్ ఆఫీసర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈయొక్క కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మిద్దె గణేష్, చేగు సుధాకర్ అప్ప, అత్తాపురం మహేందర్ రెడ్డి, భాను, మహేందర్ రెడ్డి, కరెడ్ల నరేందర్ రెడ్డి, రాజు నాయక్, తదితరులు ఉన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

