ఆయిల్ పామ్  అవగాహన సదస్సు

ఆయిల్ పామ్  అవగాహన సదస్సు

నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్17:  బుధవారం కిషన్ నగర్ గగ్రామం కాశీనాథ్ ఫీల్డ్ లో రైతులకు ఆయిల్ ఫామ్ సాగు గూర్చి అవగాహన సదస్సు నిర్వహించారు.రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో దాదాపు 252 ఎకరాల ఆయిల్ ఫామ్ పంట సాగు అయిందని తెలిపారు. ఇంకా ఆసక్తి ఉన్న రైతులు వెంటనే అధికారులను మరియు కంపెనీ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు.ఫరూక్ నగర్ మండలం లో ఆయిల్ ఫామ్  సాగు చేసిన రైతులకు ఆర్థిక సహాయంగా రైతుల ఖాతాల్లో జమ అయిందని తెలిపారు .ఆయిల్ ఫామ్ పంట సాగు చేసే రైతులకు 90% డ్రిప్ సబ్సిడీ ఉన్నదని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటకు  కావల్సిన ఎరువులకు ఒక ఎకరానికి 4200 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు 16,800 రూపాయలు ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందని తెలిపారు. ఎకరాకు 8నుండి 10 టన్నుల పైనే గెలల దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం టన్ను పామాయిల్ గెలల  మద్దతు ధర 21,000/- వుందని చెప్పారు.మన జిల్లాకు కేటాయించిన ఆయిల్ వాల్యూ కంపెనీ వారు పొలం దగ్గరికి వచ్చి పంట కొనుగోలు చేస్తుందన్నారు.జాయిన్ కంపెనీ ప్రతినిధులు,డ్రిప్ నుండి పామ్ ఆయిల్ కి ఫోర్టిగేషన్ పై రైతులకు అవగాహన కల్పించడం జరిగిందిఈ కార్యక్రమంలో షాద్‌నగర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి హిమబిందు, ఆయిల్ వాల్యూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాం మోహన్రావు, ఆయిల్ వాల్యూ కంపెనీ ఏరియా మేనేజర్ - ప్రమోద్ కుమార్, ఆయిల్ వాల్యూ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్  టి, మల్లారెడ్డి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
సార భద్రమ్మ పార్దివ దేహాన్ని  పూలమాలవేసి నివాళులర్పించిన  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్
సమాజా నిర్మానంలో జర్నలిస్టుల పాత్ర కీలకం 
నందిగామ మండలం ఎంపీడీవో కార్యాలయ భవనం స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభం
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌లో ఉత్తమ స్థానంలో నిలిచిన పెంబి బ్లాక్. 
ఎంకన్నగూడ తాండా సేవాలాల్ గుడికి బీజేపీ నేత అందే బాబన్న రూ.25,000 విరాళం
జనసేవలో అంకితభావానికి గౌరవం... డాక్టర్ వెంకన్న బాబుకు విశిష్ట పురస్కారం