రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించిన సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించిన సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు

నమస్తే భరత్ : ఈరోజు ఉదయం  10.30 గంటలకు పాత  బస్స్టాండ్ వద్ద, అందాజ 60 సంవత్సరాలు పైబడిన దుద్దెడ గ్రామానికి చెందిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ద్విచక్ర వాహనదారుడు టక్కరు ఇవ్వగా అతను సొమ్మసిల్లి రోడ్డు పైన పడిపోగా వెంటనే అక్కడ ట్రాఫిక్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు రాజేష్, కమలాకర్ వెంటనే మోటార్ సైకిల్ అతనిని పట్టుకొని వెంట అంబులెన్స్ కు ఫోన్ చేసి 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి  అంబులెన్స్ లో గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి  మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తిని  సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు అప్పగించడం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగి పడిపోయిన వ్యక్తిని గమనించి మానవత్వాన్ని చాటి ఇరువురు కానిస్టేబుళ్లు వెంటనే అతని వద్దకు వెళ్లి పైకి లేపి నీళ్లు తాగిపించి  108 అంబులెన్స్ కి ఫోన్ చేసి  ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి వారి బంధువులకు సమాచారం అందించారు. ఇరువురు కానిస్టేబుల్ చేసిన సేవలను గుర్తించిన ప్రజలు  అభినందించారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News