ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్లో ఉత్తమ స్థానంలో నిలిచిన పెంబి బ్లాక్.
తేదీ, ఏప్రిల్ 18, 2025-
నమస్తే భరత్ : ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన నిర్మల్ జిల్లా పెంబి బ్లాక్ జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్, 3వ జోన్ లో 2 వ స్థానంలో నిలిచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఎబిపి) కింద పెంబి బ్లాక్ అక్టోబర్ నెల నుండి డిసెంబర్-2024 త్రైమాసికానికి మొత్తం 500 బ్లాక్ లలో ర్యాంకింగ్స్లో జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్, 3వ జోన్ లో 2వ ర్యాంక్ను సాధించిందన్నారు. దీంతో పెంబి బ్లాక్ అభివృద్ధి కోసం 1 కోటి రూపాయల అవార్డును కూడా సాధించిందన్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, ప్రాథమిక మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలతో సహా, 40 రంగాల పనితీరు సూచికల ఆధారంగా ఈ ర్యాంకింగ్లు సాధ్యమైనట్లు తెలిపారు. జూలై 2024లో నిర్వహించిన సంపూర్ణనాత్ అభియాన్, పనితీరును మెరుగుపరచడంలో కూడా ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమం కీలక పాత్ర పోషించిందన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, జిల్లా అధికారులు, పెంబి మండలం అధికారులు, ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ ప్రతినిధి నవీన్ ల కృషి, ప్రజల సహకారంతో ఈ అద్భుతమైన విజయం దక్కిందని కలెక్టర్ అభినందనలు తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
