ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి  

ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి  ఫిజికల్ ఫిట్నెస్

గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి 

 ఆరోగ్య పరిరక్షణ గురించి వీక్లీ పెరేడ్ 

విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యం 

 ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్

తేదీ: 19-ఏప్రిల్-2025  నమస్తే భారత్ : ఈ రోజు సిద్దిపేట పెద్ద కోడూర్ గ్రామ శివారులో ఉన్న సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో  జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, సిబ్బందికి  వీక్లీ పరేడ్ పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం  నిర్వహించడం జరిగింది. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, గారు సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్  ప్రదర్శనని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ  మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని,  సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు.  గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి, విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యం, ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకో వద్దు, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని. చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని జిల్లాకు, తెలంగాణ పోలిస్ శాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు ,చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికిM తీసుకురావలన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు  అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే, పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని హెచ్చరించారు . మరియు రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు.వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.మరియు సమయం దొరికినప్పుడు భార్యా పిల్లలతో ఉల్లాసంగా గడపాలని సూచించారు. మరియు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తెలిపారు. సైబర్ నేరాలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్, ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. సర్వేసుకు సంబంధించిన మరియు వ్యక్తిగతంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ విధుల గురించి  పెరేడ్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు  కార్తిక్, పూర్ణ చందర్, ధరణి కుమార్, రాజేష్, విష్ణుప్రసాద్, కార్తీక్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మరియు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్