సమాజంలో అందరూ సోదరభావంతో మెలగాలి.

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

సమాజంలో అందరూ సోదరభావంతో మెలగాలి.

పీర్లగూడ గ్రామంలో మాజీ సర్పంచ్ మోబిన్ ఘోరీ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.

నమస్తే భారత్,షాద్ నగర్ :ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని, సమాజంలో అందరూ సోదర భావంతో మెలగాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం పీర్లగూడ గ్రామంలో మాజీ సర్పంచ్ మోబిన్ ఘోరీ ముస్లిం సోదరులకు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. రంజాన్ మాస విశిష్టతను మాజీ ఎమ్మెల్యే కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.  ముస్లిం సోదరసోదరిమనులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన