ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
నమస్తే భారత్: పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఇ. బయ్యారం x- రోడ్ లోగల ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మొదటగా ఎక్సలెంట్ విద్యా సంస్థల ఛైర్మన్ యూసఫ్ షరీఫ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. విద్యార్ధిని-విద్యార్ధులకు ప్రాధమిక విద్య చాలా ముఖ్యమైనదని అన్నారు. విద్యార్ధులు ప్రాధమిక విద్య నుండే చదివే ప్రతి అంశం పట్ల పూర్తి అవగాహనతో పరిశీలన చేసి, అర్ధం చేసుకుంటూ చదవాలని అన్నారు. ప్రతి విద్యార్ధి కష్ట పడుతూ కాకుండా ఇష్టపడి చదవాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం వార్షిక పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని-విద్యార్ధులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ వేడుకలలో విద్యార్ధినుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్ధిని - విద్యార్ధుల నృత్య ప్రదర్శనలు, కేరింతలతో పాఠశాల వాతావరణం ఎంతో సందడిగా-కోలాహలంగా మారింది. ఈ వేడుకలలో ఎక్సలెంట్ విద్య సంస్థల కరెస్పాండెంట్ ఖాదర్ ,డైరెక్టర్లు యాకూబ్ షరీఫ్, నర్సా రెడ్డి , బండారు నరేంద్ర , ప్రిన్సిపాల్ సురేష్ , సీనియర్ ఉపాద్యాయిని వలసల మోహన్, ఉపాద్యాయినీ- ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

