హిందువులపై దాడులకు పాల్పడితే సహించేది లేదు విశ్వహిందూ పరిషత్
---విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పేటలో నిరసన ర్యాలీ
---కలెక్టరేట్లో వినతిపత్రం అందజేత
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : హిందువులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని విశ్వహిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాంబాబు అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు చట్టాన్ని తొలగించాలని హిందువులపై దాడులకు పాల్పడుతూ హిందూ దేవాలయాల ను, వ్యాపారస్తులను హిందూ సంస్థలను ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని ఈ దురాగతాన్ని దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారతదేశం హిందూ దేశమని ఈ దేశంలో హిందువులు స్వేచ్ఛగా ప్రాణవాయువును పీల్చుకునే హక్కు ఉందన్నారు. వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి హింసకాండ జరగకుండా అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. హిందువుల జోలికి వస్తే ఎవరికి కూడా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. చౌక్ బజార్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని చేపట్టి అనంతరం కలెక్టరేట్లో ఏవో జయసుధ కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో డా. మధన్ మోహన్ రెడ్డి, కన్న శివకుమార్, మురళి బట్టడ్, జ్యోతి, నిర్మల, వందన, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
