హిందువులపై దాడులకు పాల్పడితే సహించేది లేదు విశ్వహిందూ పరిషత్

హిందువులపై దాడులకు పాల్పడితే సహించేది లేదు విశ్వహిందూ పరిషత్

---విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పేటలో నిరసన ర్యాలీ 

---కలెక్టరేట్లో వినతిపత్రం అందజేత 

 నమస్తే భారత్  /    నారాయణపేట్ జిల్లా  : హిందువులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని విశ్వహిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాంబాబు అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు చట్టాన్ని తొలగించాలని హిందువులపై దాడులకు పాల్పడుతూ హిందూ దేవాలయాల ను, వ్యాపారస్తులను హిందూ సంస్థలను ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని ఈ దురాగతాన్ని దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారతదేశం హిందూ దేశమని ఈ దేశంలో హిందువులు స్వేచ్ఛగా ప్రాణవాయువును పీల్చుకునే హక్కు ఉందన్నారు. వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి హింసకాండ జరగకుండా అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. హిందువుల జోలికి వస్తే ఎవరికి కూడా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. చౌక్ బజార్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని చేపట్టి అనంతరం కలెక్టరేట్లో ఏవో జయసుధ కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో డా. మధన్ మోహన్ రెడ్డి, కన్న శివకుమార్, మురళి బట్టడ్, జ్యోతి, నిర్మల, వందన, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్