జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో సత్తా చాటిన ఉమ్మగాని వశిస్ట్ గౌడ్.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో మహబూబాబాద్ పట్టణానికి చెందిన జర్నలిస్టు ఉమ్మగాని మధు - కృష్ణవేణి ల కుమారుడు వశిస్ట్ గౌడ్ 98.22 శాతంతో అత్యున్నత ప్రతిభ కనపరిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 7300 సాధించి జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంకు సాధించిన పట్ల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. జేఈఈ లో మంచిర్యాంకు సాధించిన వశిష్ట కు మార్గదర్శి బీఈడీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ ఉమ్మగాని అరుణ్ కుమార్, కిసాన్ పరివార్ సీఈవో, బహుజనవాది డాక్టర్ వివేక్, టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపెల్లి శ్రీహరి, గిరి, శేఖర్, పల్లె శ్రీనివాస్, బండారి జ్ఞానేందర్ తదితరులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

