జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
విచార అనంతరం కలెక్టర్కు నివేదికను అందించనున్నారు
నమస్తే భారత్: ములుగు బ్యూరో : జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం జిల్లా ప్రధాన ఆస్పత్రి ములుగు యందు సంభవించిన శిశు మరణం పై జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి ఆధ్వర్యంలో నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి తన ఛాంబర్ లో శిశు మరణం పై ఏర్పాటు చేసిన నిర్ధారణ కమిటీ శిశు మరణంకు గల కారణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి బిల్లా ప్రవళిక భర్త చందు గ్రామము బండారుపల్లి గర్భిణీ స్త్రీ, జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి నుండి డెలివరీ అయ్యేంతవరకు వివరాలు ఉన్న రిపోర్టును పరిశీలించారు. నిర్ధారణ కమిటీ తో చర్చించారు. నిర్ధారణ కమిటీ పరిశీలన పూర్తి నివేదిక ను జిల్లా కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్ధారణ కమిటీ సభ్యులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. గోపాలరావు, జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్. జగదీశ్వర్, ఆ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్. సుధాకర్ మత్తు డాక్టర్ .భారతి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్. రణధీర్ డా. శ్రీకాంత్, డి డబ్ల్యు ఓ శిరీష, ములుగు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లకుపతి, డాక్టర్. నాగనిష్ గణేష్ నిర్ధారణ కమిటీ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

