జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం

విచార అనంతరం కలెక్టర్కు నివేదికను అందించనున్నారు

జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం   శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం

నమస్తే భారత్: ములుగు బ్యూరో : జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం జిల్లా ప్రధాన ఆస్పత్రి ములుగు యందు సంభవించిన శిశు మరణం పై జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి  ఆధ్వర్యంలో నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి  తన ఛాంబర్ లో శిశు మరణం  పై ఏర్పాటు చేసిన నిర్ధారణ కమిటీ శిశు మరణంకు గల కారణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం  జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి  బిల్లా ప్రవళిక భర్త చందు గ్రామము బండారుపల్లి గర్భిణీ స్త్రీ, జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి నుండి డెలివరీ అయ్యేంతవరకు వివరాలు ఉన్న రిపోర్టును పరిశీలించారు. నిర్ధారణ కమిటీ తో చర్చించారు. నిర్ధారణ కమిటీ పరిశీలన పూర్తి నివేదిక ను జిల్లా కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్ధారణ కమిటీ సభ్యులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. గోపాలరావు, జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్. జగదీశ్వర్, ఆ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్. సుధాకర్ మత్తు డాక్టర్ .భారతి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్. రణధీర్ డా. శ్రీకాంత్, డి డబ్ల్యు ఓ శిరీష,  ములుగు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లకుపతి, డాక్టర్. నాగనిష్ గణేష్  నిర్ధారణ కమిటీ పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్