డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో కంట్రోల్ రూం ఏర్పాటు.
టోల్ ఫ్రీ నెంబర్ 9347416178 - జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
నమస్తే భారత్: ములుగు బ్యూరో : జిల్లాలో ప్రస్తుత వేసవిలో ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 9347416178 కు ఫోన్ చేసి సమస్యలు తెలుపవచ్చని అన్నారు. కంట్రోల్ రూమ్ కార్యాలయాల పని దినాలలో ప్రతి రోజు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, నిర్ణీత వేళల్లో టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ధాన్యం అమ్మకాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని అన్నారు.ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులు ఉంటే సెల్ నెంబర్ : 9347416178 కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా లోని రైతుల సౌకర్యార్థం నెలకొల్పిన కంట్రోల్ రూమ్ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డులు లేనివారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డులు లో పేరు అదనంగా జత చేయడానికి మీసేవ నందు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 7, 2025 నుండి ఈ ప్రక్రియ కొనసాగుతుందని మీ సేవ నందు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అర్హులను గుర్తించి వారికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. జిల్లా ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం మీసేవ నందు దరఖాస్తు చేసుకోవచ్చనీ ఆ ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
