డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.

టోల్ ఫ్రీ నెంబర్ 9347416178 - జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.

నమస్తే భారత్: ములుగు బ్యూరో : జిల్లాలో ప్రస్తుత వేసవిలో ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా మేనేజర్, పౌర సరఫరాల  శాఖ అధికారి కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా  దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్  9347416178 కు ఫోన్ చేసి సమస్యలు తెలుపవచ్చని అన్నారు. కంట్రోల్ రూమ్ కార్యాలయాల పని దినాలలో ప్రతి రోజు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, నిర్ణీత వేళల్లో టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ధాన్యం అమ్మకాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చని సూచించారు.  వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని అన్నారు.ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులు ఉంటే సెల్ నెంబర్ :  9347416178 కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా లోని రైతుల సౌకర్యార్థం నెలకొల్పిన కంట్రోల్ రూమ్ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డులు లేనివారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డులు లో పేరు అదనంగా జత చేయడానికి మీసేవ నందు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 7, 2025 నుండి ఈ ప్రక్రియ కొనసాగుతుందని మీ సేవ నందు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అర్హులను గుర్తించి వారికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. జిల్లా ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం మీసేవ నందు దరఖాస్తు చేసుకోవచ్చనీ ఆ ప్రకటనలో  కలెక్టర్ పేర్కొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్