అర్హులైన ఆపరేటర్ లకు సి గ్రేడ్ పదోన్నతి ప్రతిభ పరీక్ష నిర్వహించాలి.
యాక్టింగ్ జి యం లక్ష్మీ పతి గౌడ్ కు వినతి పత్రాన్ని అందించిన టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.
నమస్తే భారత్: మణుగూరు : డి' గ్రేడ్ అర్హత పొంది రెండు సంవత్సరాలు పూర్తి చేసిన ఈ.పి ఆపరేటర్ లకు సి గ్రేడ్ పదోన్నతి ప్రతిభ పరీక్ష నిర్వహించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుతూ మణుగూరు ఏరియా యాక్టింగ్ జి యం లక్ష్మీపతి గౌడ్ కు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు శనివారం నాడు వినతి పత్రాన్ని అందించారు. ఏరియా నందు ఈ పి ఆపరేటర్ అవసరాలను గుర్తించి 2022 వ సంవత్సరం లో కొత్త ఆపరేటర్లకు అవకాశం కల్పించడం యాజమాన్యం అందించిన బృహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆసక్తి గల యువ ఉద్యోగులు ఆపరేటర్ లుగా ఎంపికై. డి గ్రేడ్ పదోన్నతి సాధించడం జరిగిందని తెలిపారు. డి గ్రేడ్ లో రెండు సంవత్సరాలు పూర్తి చేసిన వారిని గుర్తించి సి గ్రేడ్ పదోన్నతి ఇవ్వడానికి స్థానిక యాజమాన్యం ప్రతిభ పరీక్ష ఆధారంగా చేసుకొని ఎంపిక చేయడం జరుగుతుందని అక్టోబర్ మాసంలో నిర్వహించవలసిన సి గ్రేడ్ పదోన్నతి ప్రతిభ పరీక్ష నేటి వరకు నిర్వహించకపోవడం వల్ల యువ ఆపరేటర్ లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సంస్థ ప్రగతి కోసం నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాల సాధన కోసం రేయింబవళ్ళు కష్టించి పని చేసి లక్ష్యాల సాధన కు దోహద పడిన యువ ఆపరేటర్ శ్రమను గుర్తించి అర్హులైన వారికి సి గ్రేడ్ పదోన్నతి ప్రతిభ పరీక్ష నిర్వహించాలని వినతి పత్రం రూపంలో పొందుపరచి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మస్తాన్, ముకేశ్, మునిగేల నాగేశ్వర రావు రాము, ఇమ్రాన్, కళ్యాణ్ కుమార్, శ్రీనివాస్ ఉద్యోగులు రాజేంద్ర ప్రసాద్, ఇసాక్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

