సింగరేణి డైరెక్టర్ల సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై చర్చించాలి. వారి కనీస వేతనాలను పెంచాలి

కార్మికులకు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నేత ఐ కృష్ణ డిమాండ్

సింగరేణి డైరెక్టర్ల సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై చర్చించాలి. వారి కనీస వేతనాలను పెంచాలి

నమస్తే భారత్: మణుగూరు : రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 30 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను త్వరలో హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగే డైరెక్టర్ల సమావేశంలో చర్చించి వారి వేతనాలను పెంచాలని కోలిండియా వేతనాలను అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర అధ్యక్షులు ఐ క్రిష్ణ పిలుపునిచ్చారు. రైటర్ బస్తిలోని కొత్తగూడెం ఐ ఎఫ్ టి యు కార్యాలయo నందు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కే.సారంగపాణి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారి ప్రసంగిస్తూ సింగరేణి మేనేజ్మెంట్ 1000 కోట్ల లాభంలో ఉందని చెబుతున్న ఎందుకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచడం లేదని వారి సమస్యలను పరిష్కరించడం లేదని వారి కనీస అవసరాలు తీర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు భాగంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఇప్పటివరకు జరిగిన సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఊసే ఎత్తలేదని ఇది సరైనది కాదని వారన్నారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికుల శ్రమ లేకుండా సింగరేణి లాభాల్లో లేదని ఈ విషయాన్ని సింగరేణి మేనేజ్మెంట్ గుర్తించాలని వారు అన్నారు సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జాతీయ సెలవు దినాలను వారి వేతనాలను ఇవన్నీ రేపు డైరెక్టర్ ల సమావేశంలో చర్చించి కోల్ ఇండియా వేతనాలను అమలు చేయాలని వారు అన్నారు. ఈసారి సింగరేణి ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్ ని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని సింగరేణి క్వార్టర్స్ ను కూలగొట్టి ప్రభుత్వానికి ఇవ్వడాన్ని ఐ ఎఫ్ టి యు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కార్మికులకు ఇవ్వాలని వారు అన్నారు. సింగరేణి క్వార్టర్స్ ను కూలగొట్టి ప్రభుత్వానికి ఇస్తూ బలవంతంగా కార్మికులను నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించడం సరైనది కాదని వారన్నారు తక్షణమే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతన చట్టాలను అమలు చేసే విధంగా ప్రభుత్వాలు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాలరాసే 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా చేయడని వ్యతిరేకించాలని,ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక వర్గాన్ని కట్టి బానిసత్వానికి గురి చేసే లక్ష్యంతో *ఆర్ఎస్ఎస్ బిజెపి సర్కార్ తెచ్చే లేబరు కోడ్ ల రద్దుకై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని కోరుతూ కార్మిక వర్గం అంత 139వ మేడే జరపాలని ఆయన పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కే సారంగపాణి,రాష్ట్ర నాయకులు డి ప్రసాద్,గౌని నాగేశ్వరరావు,ఎండి రాశుద్దిన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్,కోశాధికారి మోతుకూరి మల్లికార్జునరావు,జిల్లా నాయకులు రావూరీ ఉపేందర్రావు, సురేష్, మారుతిరావు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్