రైతులను ఆదుకోవాలని తహసిల్దార్ కు వినతి పత్రం
నమస్తే భారత్ మద్దూరు : సోమవారం కురిసిన అకాల వర్షం వల్ల మద్దూరు మండలం నందిపాడు పల్లెర్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ, అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయు కె ఎస్ ) మద్దూరు మండల కమిటీల ఆధ్వర్యంలో నందిపాడు, పల్లెర్ల, దానమ్మ తాండ గ్రామ రైతులతో తహసిల్దార్ కార్యాలయం, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ మహేష్ గౌడ్ గారికి, వ్యవసాయ అధికారి గార్లకు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎ.నరసింహులు రైతు సంఘం మండల నాయకులు బి కిష్టప్ప, బి ఆంజనేయులు, రైతులు గొల్ల గంగప్ప, దిద్ది మైపాల్ ,పి. రాజు, ఎం. గుండప్ప, మదరప్ప, పెద్ద చెన్నప్ప, పీర్ సాబ్, మొగులప్ప, రాములు, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
