ప్రజా ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూరు : కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతాయని తోరూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు.పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని గోపాలగిరి గ్రామంలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని, ఝాన్సీ రెడ్డి లు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నాడని అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డిల సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, చర్లపాలెం,గోపాలగిరి గ్రామ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి, చింతకుంట్ల లక్ష్మణ్, యనమల శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

