స్వయం ఉపాధి పేరుతో పేద ప్రజలతో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య
నమస్తే భారత్,షాద్ నగర్ మార్చ్27:రాజీవ్ యువ వికాసం పేరుతో 75 రకాల స్వయం ఉపాధికి సంబంధించిన యూనిట్లకుఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎన్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 వేల నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తాం ఆన్లైన్ దరఖాస్తులు పెట్టుకోండి అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసింది ఆశావాహులైన పేదలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున కులం ఆదాయం సర్టిఫికెట్ కోసం మీ సేవల దగ్గర పడిగాపులు కాసి అప్లికేషన్లు పెట్టుకొని అవి తీసుకొని పోయి ఎమ్మార్వో ఆఫీస్ లో ఇస్తే ఎమ్మార్ ఆఫీసులల్ల సర్వర్ డవ్ మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఎలా అప్లికేషన్లు పెట్టుకుంటారు ఎలా ఉపాధి పొందుతారు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఆయన మండిపడ్డారు దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 5 అని ప్రకటన చేసింది ప్రభుత్వం సర్వర్ డౌన్ తో మూడు రోజులు గడిచిపోయాయి కంటిన్యూగా మరో మూడు రోజులు పండగల పేరుతో సెలవులు వస్తున్నాయి పేదలు ఎలా దరఖాస్తులు చేసుకుంటారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు కంటిన్యూగా సర్వర్ డౌను కావడం అంటే అది ప్రభుత్వమే ఈ రకంగా వ్యవహరిస్తుందని అనిపిస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.మీ సేవలధార వేలాది లక్షలాది అప్లికేషన్ ఇప్పటికే పెట్టుకున్నారు దాని ద్వారా ప్రభుత్వానికి మాత్రం పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది కానీ ఆశాభాహులైన యువత మహిళలు పేదలు కులం సర్టిఫికెట్ ఆదాయం సర్టిఫికెట్ చేతికి రాకపోవడంతో ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకోలేని స్థితిలో అయోమయంలో ఉన్నారు ఇకనైనా ప్రభుత్వం ఆన్లైన్ క్లియరెన్స్ చేసి అప్లికేషన్లు పెట్టుకున్న ప్రజలకు సహకరించాలని ఆయన కోరారు అలాగే దరఖాస్తులు పెట్టుకోవడానికి డేటును కూడా పొడిగించాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఎమ్మార్వో ఆఫీసుల ముందు ధర్నాలు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
