రైతు రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించుటకు ఫ్లెక్సీ తయారీదారుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
నమస్తే భరత్ నిర్మల్:-పట్టణంలో గ్రామాలలో రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలలో లబ్ధి పొందిన వారి వివరాలను గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలలో ప్రదర్శించేందుకై ఫ్లెక్సీ తయారీదారుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 6×3 సైజులలో ఒక ఫ్లెక్సీలో దాదాపు 35 నుంచి 40 మంది రైతుల పేర్లు ప్రచురించవలసి ఉంటుందన్నారు. దాదాపు 2000 ఫ్లెక్సీలు అవసరమగునని, ఒక్కో ఫ్లెక్సీ గరిష్ట ధర 350రూపాయలుగా నిర్ణయించామన్నారు. ఆసక్తి గలవారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిర్మల్ పేరు మీద పదివేల రూపాయల డీడీ ని (ఎస్బిఐ బ్యాంకు) తీసి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల ప్రాంగణంలోని మొదటి అంతస్తులో గల 27వ నంబరు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఈనెల 27వ తేదీ నుంచి 29 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు అన్ని పని వేళలలో జీఎస్టీ పత్రాలతో కలిపి సమర్పించాలని తెలిపారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ దాఖలు చేసిన వారందరి సమక్షంలో టెండరు ఖరారు చేయబడునని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

