ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి
* షీటీం ప్రత్యేక అధికారిని రమాదేవి
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన ఎంతో అవసరమని పిల్లలు పెద్దలు అన్న బేధం లేకుండా చట్టాల పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు ముఖ్యంగా పోక్సో చట్టాల మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని షీటీం ప్రత్యేక అధికారిణి రమాదేవి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు రామవరంలోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు వివరించారు. మైనర్ బాలికలపై వారి ఇష్టంతో లేదా ఇష్టం లేకుండా ఏ పరిస్థితుల్లో అయిన మగవారి మీదే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితురాలు మైనర్ అయితే తల్లిదండ్రులు ఎలాంటి భయం లేకుండా పోలీసులను ఆశ్రయించాలని వారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి తెలియజేయబడవని తెలిపారు. టీచర్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు సమాజంలోని మంచి చెడుల గురించి అవగాహన కలిగించడం వల్ల నేరాలను అరికట్టేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ లను జ్ణాన సముపార్జన కోసం మాత్రమే వినియోగించాలని చిన్ననాటి నుంచే వారికి నైతిక విలువలు కలిగి జీవించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగయ్య, రాజు, ప్రధాన అధ్యపకురాలు పర్వీన్ సుల్తానా, నీలా, లక్ష్మీ ప్రసన్న, నుసరత్, సల్మా, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
