ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు అడ్మిషన్ కరపత్రాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
నమస్తే భారత్: ములుగు బ్యూరో : ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చేరడానికి కళాశాల రూపొందించిన 2025-26 సంవత్సరానికి అడ్మిషన్ కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఆవిష్కరించారు. కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి కళాశాల అందిస్తున్న సౌకర్యాలను, గత సంవత్సరము కళాశాల విద్యార్థులు వివిధ ఉన్నత విద్య పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొప్పుల మల్లేశం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి బాలయ్య, న్యాకు కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ కవిత, కళాశాల అడ్మిషన్ కై దోస్త్ కన్వీనర్ డాక్టర్ జె శంకర్ మరియు దోస్త్ కమిటీ సభ్యురాలు అధ్యాపకురాలు బి శిరీష పాల్గొన్నారు. కళాశాల అడ్మిషన్లు పెంచడానికి అందరం సమిష్టిగా కృషి చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

