చిల్లంచర్ల గ్రామంలో వెటర్నరీ డాక్టరు నీ నియమించాలి
సిపిఎం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్
నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లొని మరిపెడ మండల సిపిఎం బృందం శుక్రవారం చిల్లంచర్ల లో ఉన్నటువంటి వాసు వైద్య దావఖానా నూ సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ మాట్లాడుతూ చిల్లంచర్ల గ్రామంలో పశు వైద్య డాక్టర్ లేక దాదాపు సంవత్సరకాలం అవుతుందని అన్నారు, అందువల్ల గొర్రెల మేకల కాపర్లు, గేదెల కాపర్లు సరైనటువంటి మందులు లెక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు , గ్రామానికి వచ్చిన సిపిఎం బృందం రైతులని నేరుగా అడిగి ఈ సమాచారం తెలుసుకోవడం జరిగింది అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పశు సంవర్ధక శాఖ, మరియు జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి వైద్య అధికారునీ నియమించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు చెన్నబోయిన వెంకన్న , రాంబాబు పగిండ్ల శీను, సారంగం సందు ఉప్పలయ్య,ధనుంజయ్ లక్కీ తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

