తెలుగు మాస్టర్ చంద్ర ప్రకాష్ కు ఘనంగా వీడ్కోలు
- హరిపిరాల హైస్కూల్లో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానోత్సవం
నమస్తే భారత్ :-తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని హరిపిరాల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు బోధిస్తున్న తండాల చంద్ర ప్రకాష్ గౌడ్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమాన్ని గురువారం పాఠశాల ఆవరణంలో హెచ్ఎం బి. వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మాస్టర్ చంద్ర ప్రకాష్ - శోభారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమన్నారు. తెలుగు ఉపాధ్యాయుడు చంద్ర ప్రకాష్ తన సర్వీస్ లో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాడని కొనియాడారు. విద్యారంగా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేవన్నారు. తెలుగు మాస్టర్ చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, ఈ వృత్తిలో విద్యార్థులకు సేవలందించి పదవీ విరమణ పొందుతుండటం ఆనందంగా ఉందన్నారు. అనంతరం చంద్ర ప్రకాష్- శోభారాణి దంపతులను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్య కమిటీ, బంధుమిత్రులు, విద్యార్థులు శాలువాలు, మేమొంటో, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం. రవి, సుధాకరా చారి, మధుకర్ రెడ్డి, రాజేశ్వర్, నారాయణ, కుమార్, సంపత్ కుమార్, శంకర్, సంపత్, రవీందర్ , తస్లీమా మహేందర్, ఆంజనేయులు, పిడి రాజు, రవి, మౌనిక, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
