జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు రాష్ట్రస్థాయి అవార్డులు.
నమస్తే భరత్ నిర్మల్:-// జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు 2 రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. బుధవారం హైదరాబాదు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో శ్రీనిధి 12వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను, శ్రీనిధి రుణాల వసూలు 88 శాతం, క్రెడిట్ ప్లాన్ అచీవ్మెంట్ లో 105 శాతం లక్ష్యాలను సాధించి ఉత్తమంగా నిలిచినందుకుగాను రాష్ట్రంలోనే రెండవ స్థానం అవార్డు లభించింది. లోకేశ్వరం మండలం ప్రగతి మండల సమాఖ్యకు ఉత్తమ మండల సమస్యగా రాష్ట్రంలో రెండు స్థానం దక్కింది. కాగా జిల్లాకు వరుసగా నాలుగో సంవత్సరం అవార్డు లభించింది. ఈ అవార్డులను డిఆర్డిఓ తరపున జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు సాగర, ఎపిఎం మల్లేష్ లు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క, చేతుల మీదుగా అందుకున్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

