ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నమస్తే భరత్ నిర్మల్:-పట్టణంలోని  బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయితీ రాజ్ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. వివిధ జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి విందును స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలంతా అన్ని పండుగలను కలిసికట్టుగా సహోదర భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని మతాల సారం ఒకటేనని, ప్రజలంతా కలిసికట్టుగా ఉంటూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. సమాజ సేవ, దయాగుణం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన
  నమస్తే భారత్ / మద్దూరు, నారాయణపేట జిల్లా (ఏప్రిల్ 17) :  తెలంగాణ రాష్ట్రంలోని భూమి కలిగిన ప్రతి రైతుకు అందుబాటులో ఉండే విధంగా భూ
రిపోర్టర్ జిన్నా లచ్చయ్య ను పరామర్శించిన  కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి 
#Draft: Add Your Title
కలెక్టర్ జితేష్ పాటిల్ కు ఘన సన్మానం
గాలికుంటు వ్యాధి టీకాల శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శిక్తా పట్నాయక్
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్