నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నమస్తే భారత్   నిర్మల్:-జిల్లా బుధవారం సాయంత్రం  ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలించారు. హౌస్ డిజైన్, ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలను చేసారు. నిర్మాణ నాణ్యతను మెరుగుపరచాలని, పనులను వేగంగా పూర్తి చేయాలని, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్. మాట్లాడుతూ, ఇండ్లు లేని పేదవారికి ఇండ్లను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. అన్ని మండలాల్లో నిర్మించ తలపెట్టిన నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల సర్వే కొనసాగుతోందని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎంపీ డివో కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తూ, పట్టణ పరిధిలో ఆస్తిపన్ను వసులును వందశాతం పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఎల్ ఆర్ ఎస్ కు ఈనెల 31 వరకు గడవు ఉన్నందున దస్తుదారులు 25 శాతం లబ్ధి పొందేలా ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.  ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాగులు, నది పరివాహక ప్రాంతాలలో ఇసుక రీచ్ లను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోసింగ్ పిడి రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో సునీత, ఎంపీఓ రత్నాకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన