ఆకాశవాణిలో 37వ వార్షికోత్సవ వేడుకలు
* శ్రోతలను సన్మానించిన ఆకాశవాణి అధికారులు
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆవిర్భవించి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు రేడియో స్టేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ప్రోగ్రాం హెడ్ బైరి శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో "శ్రోతలతో ఆత్మీయ సమ్మేళనం" ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రేడియో వింటున్న శ్రోతలు కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గత 36 సంవత్సరాలుగా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించి శ్రోతలను అలరిస్తున్న తీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆకాశవాణి ఏర్పాటు నుండి రేడియో కార్యక్రమాలు వింటున్న శ్రోతలు వారి వారి అభిప్రాయాలు అనుభూతులను వేదిక మీద పంచుకున్నారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన శ్రోతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారి కొలిపాక శంకరరావు, ఇంజనీర్ బాబు సింగ్, బొల్లవరపు ప్రసాద్, స్వామి, సిబ్బంది, రేడియో జాకీలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

