మార్చి 26న, తానంచర్ల లో ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఉపయోగించుకోండి
ప్రగతి సేవా సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు
నమస్తే భారత్ :-మరిపెడ : ఈనెల మార్చి 26న, తానంచర్ల గ్రామంలో ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ప్రగతి సేవా సమితి మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు కోరారు. ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ ఆదేశానుసారం మండల నలుమూలల ఉచిత కంటి ఆపరేషన్ ప్రోగ్రాంకు గత వారం రోజులుగా మండల కో ఆర్డినేటర్ జినక సువార్త తన సిబ్బందితొ క్యాంపియన్ చేస్తున్న సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామపంచయతీ ఆవరణలొ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఐనాల పరశురాములు మాట్లాడుతూ ఈనెల 26న, బుధవారం రోజున స్ధానిక గ్రామపంచాయితీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్ లు చేయిస్తామని తెలిపారు. ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి వచ్చే రోగులు ఆధార్ కార్డు జీరాక్స్ మరియు ఫోన్ నెంబర్, వారు వివిధ జబ్బులకు రెగ్యులర్ గా వాడే మందులు తప్పని సరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. వినికిడి లోపం ఉన్నవారు మాత్రమే వెంట సహాయకులను తీసుకొని రావాలని , వెంట ఒక జత బట్టలు అవసరమైన సామాగ్రి తెచ్చుకోవలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి సేవా సమితి మరిపెడ మండల కో ఆర్డినేటర్ జినక సువార్త, తానంచర్ల ఏరియా కో ఆర్డినేటర్ తప్పేట్ల సతీష్ , అబ్బాయిపాలెం కో ఆర్డినేటర్ జినక కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
