శ్రీనిధి రుణ బకాయిల వసూలును త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.
On
నమస్తే భారత్ నిర్మల్ :-పట్టణంలోని మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీనిధి రుణాలపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, జిల్లాలో నిర్ణిత గడువులోగా శ్రీనిధి రుణాల వసూలు ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. మండలాల వారిగా మహిళా సంఘాల సంఖ్య, మంజూరు చేసిన రుణాలు, ఇప్పటివరకు సంఘాలు చెల్లించిన బకాయిలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి డిఆర్డీఓ శ్రీనివాస్, మెప్మా పిడి సుభాష్, శ్రీనిధి ప్రాంతీయ సమన్వయకర్త సరిత, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget