మద్దెల కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంబేద్కర్ వాది ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సతీమణి ఎస్తేర్ రాణి ఇటీవల మరణించడం జరిగింది. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామరెడ్డి మద్దెల శివకుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. ఎంపీతో పాటు తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ తమ బృందంతో సారయ్య కాలనీలో గల ఆచార్య డాక్టర్ మద్దెల గృహాన్ని సందర్శించి పరామర్శించారు. ఎస్తేర్ రాణి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి ఎస్తేర్ రాణి ఆకస్మిక మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన నష్టాన్ని పూడ్చలేమని కానీ ధైర్యంతో ముందుకు సాగాలని తామంతా మీకు అండగా ఉంటామని ఆచార్య డాక్టర్ మద్దెలకు వారి పిల్లలకు ధైర్యం చెప్పారు. ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో లావుడియా సత్యనారాయణ నన్నే సాహెబ్ భాస్కర్ మోహన్ లాల్ మద్దెల అభిషేక్ మద్దెల జరూష మద్దెల సాయి సుధీర్ కేదాసి కిరణ్ సుమన్ పాల్ సుహాస్ తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
