మరిపెడ మండలం మండల ఉమ్మడి వీరారం గ్రామ కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ.
నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఉమ్మడి వీరారం గ్రామంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉమ్మడి వీరారం కాంగ్రెస్ పార్టీ నాయకులు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ధనిక, బీద తారాతమ్యం లేకుండా ప్రతి ఇంటికి పౌష్టికంగా ఉన్న సన్న బియ్యం పంపిణీ చేశారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచితంగా ఇవ్వడం జరిగినది. మహబూబాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జరుపుల విజయ్ నాయక్ వారితో పాటు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు హరి సింగ్ నాయక్ , మాజీ ఎంపీటీసీ అభ్యర్థి బానోత్ రాంచందర్ నాయక్, కెలోత్ వెంకన్న నాయక్, అజ్మీరా సూర్య నాయక్, కొప్పుల గోపి, దసర చిన్నిరి, జెట్టి రమ్మన్న, దుస్స లింగ మల్లు, బిచ్య నాయక్, ధరవత్ రమేష్ నాయక్ వారితో పాటు కాంగ్రెస్ పార్టి కార్యకర్తలు మరియు లబ్ధి దారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

