విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్21:విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ రోజు కొందూర్గ్ మండల కేంద్రంలో 1.20 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించే శాఖా గ్రంథాలయం భవన కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నిత్యం గ్రంథాలయానికి వెళ్లడం ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని రకాలు విశేషాలు అవగతమవుతాయన్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమమేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో అన్ని పెద్ద గ్రామాల్లో గ్రంథాలయాలు మంజూరు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
