విద్యాభివృద్ధికి నవ లిమిటెడ్ కృషి మరువలేనిది
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
అదనపు తరగతి గది వాష్ రూమ్స్ ప్రారంభోత్సవం
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: నవ లిమిటెడ్ పాల్వంచ సంస్థ తన సామాజిక కార్యకలాపాలలో భాగంగా మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల కేశవపురం నందు ఏర్పాటుచేసిన అదనపు తరగతి గదుల వాష్ రూమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. సమాజాభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. నవ లిమిటెడ్ సంస్థ నిరుద్యోగ యువతకి శిక్షణ ఉపాధి సౌకర్యాలు కల్పించడం హర్షణీయమన్నారు. సామాజిక సేవలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అతిరామ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మౌలిక సదుపాయములు కల్పించడంలో నవ లిమిటెడ్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. జనరల్ మేనేజర్ సి ఎస్ ఆర్ ఎంజి ఎం ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం విద్య జీవనోపాదుల కార్యక్రమాలను వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా పలు ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్న విద్యా కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థితిని అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రామమూర్తి, పాల్వంచ తహసిల్దార్ వివేక్,
డీసిఎం చైర్మన్ కే.శ్రీనివాసరావు, లైసెన్ ఆఫీసర్ ఖాదరేంద్రబాబు, ఎన్. శ్రీనివాస్ సివిల్ ఇంజనీర్, సిహెచ్ శ్రీనివాసరావు, ఏపిపి రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
