పెండింగ్ సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించండి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు.
తేదీ, ఏప్రిల్ 21,2025-
నమస్తే భరత్ సోమవారం నిర్మల్ జిల్లా // బైంసా ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ, గతంలో మిల్లర్లు ప్రాసెసింగ్కు తీసుకున్న ధాన్యానికి సంబంధించి బకాయిలు ఇంకా చెల్లించకపోవడాన్ని గుర్తు చేశారు. రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ బకాయిలను త్వరగా చెల్లించాలన్నారు. గడువు లోపు చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి రికార్డు రూమ్, సిబ్బంది విధులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం సుధాకర్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
