తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబుది చెరగని ముద్ర.సామాజిక వేత్త బిజ్వార్ మహేష్ గౌడ్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబుది చెరగని ముద్ర అని సామాజిక వేత్త బిజ్వార్ మహేష్ గౌడ్ అన్నారు.ఆదివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో సామాజికవేత్త బిజ్వార్ మహేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే దార్శినికతకు మారుపేరని, దూరదృష్టితో అనేక సంవత్సరాల ముందుకు వెళ్లి ఆలోచిస్తారని,అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన కార్యకలాపాలు రూపొందిస్తారన్నది ఆయనకున్న పేరు అని మహేశ్గౌడ్తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో 1995,1999, 2014 2024 ఇలా సంవత్సరాలు గడిచి పోతుండొచ్చు కానీ ఎప్పటికప్పుడు ఎలా ఆలోచించాలో అలా తనకు తాను మార్చుకుంటారని తెలిపారు. పాఠాలు నేర్చుకుంటూనే పాలనకు మెరుగులు దిద్ది విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగు నేలను పరిపుష్టి చేసిన రాజకీయ పాలన దురంధురుడని మహేశ్గౌడ్కొనియాడారు. చంద్రబాబు గురించి ఇక్కడి ప్రజలే కాదు, ఆయన చేసిన అభివృద్దే పరోక్షంగా చెబుతుందని అన్నారు. చంద్రబబు హయాంలో హైటెక్సిటీ ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మౌళిక వసతుల కల్పన, అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణకు రప్పించి యువతకు ఉపాధిని కల్పించారని మహేశ్గౌడ్అన్నారు. తెలుగు వారి ప్రతిష్టను ప్రపంచంలో ఎన్ టిఆర్నిలబెడితే..చంద్రబాబు దానిని శక్తివంతంగా కొత్తకొత్త ఆలోచనలతో నిలబెడుతున్నారన్నారు. ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆయన వందేళ్లు ఆయురారోగ్యాలతో బ్రతికి ప్రజలకు సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నట్లు మహేశ్గౌడ్తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

