శవ రాజకీయాలు చేస్తున్న బి.ఆర్.ఎస్ బీజేపీ పార్టీ నాయకులు
ములుగు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసార్ ఖాన్
- రాజకీయ లబ్ధికోసం కావాలనే సీతక్క ని టార్గెట్ చేస్తు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
- పసిపాప చనిపోతే వాళ్ళ తల్లితండ్రులను ఓదార్చాల్సిందిపోయి రాజకీయం చేయడం దారుణం
నమస్తే భారత్: ములుగు బ్యూరో : భూ భారతి కార్యక్రమానికి వచ్చిన మంత్రుల పర్యటనను భంగం కలిగించాలని బీజేపీ, బి.ఆర్.ఎస్ నాయకుల భూములు ఎక్కడ పోతాయానో భయంతో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారని ములుగు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసార్ ఖాన్ అన్నారు. నిజానిజాలు తెలియకుండా వారి రాజకీయ లబ్ధి కోసం చిన్నారు కుటుంబాన్ని రెచ్చగొట్టి కావాలని రోడ్డు మీద ధర్నాకు దింపడం సిగ్గుచేటు అన్నారు. చిన్నారి తండ్రి జరిగిన విషయం మంత్రి సీతక్కకి తెలియజేయగా. సీతక్క జరిగిన సంఘటన గురించి తెలుసుకొని దానికి కారణమైన వారి మీద కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటి వేసి చిన్నారి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు . సీతక్క గారు చిన్నారి కుటుంబానికి అండగా ఉంటారు ఇప్పటికే సీతక్క కుమారుడు సూర్య కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. మరణించిన చిన్నారి కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. చిన్నపాప మీద చేస్తున్న చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు. ఇప్పటికైనా ఈలాంటి నీచ రాజకీయాలు చేయటం మనుకుంటే మంచిదని అన్నారు ఉల్లేరావు శ్రావణ్ కుమార్ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
